ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..ఉగాదికల్లా అందుబాటులోకి ఆ సేవలు

-

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పాడు సిఎం జగన్ మోహన్ రెడ్డి. వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ లో క్రమం తప్పకుండా మందులు ఇవ్వడమే కాకుండా, బాధితులు ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న దానిపై సూచనలు కూడా ఇవ్వాలన్నారు.

CM Jagan Mohan Reddy

ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి అని ఆదేశించారు జగన్. అవసరాలకు తగ్గట్లుగా 104 వాహనాలను సమకూర్చుకోవాలి. ఎక్కడా ఖాళీలు లేకుండా సిబ్బందిని భర్తీ చేయాలి. ఆలోగా విలేజ్ క్లినిక్స్ నిర్మాణాలను పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఉగాది కల్లా వీటిని పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version