BREAKING : ఏపీ రైతులకు శుభవార్త..వారి ఖాతాల్లో 2,096.04 కోట్లు జమ

-

BREAKING : ఏపీ రైతులకు శుభవార్త. కాసేపటి క్రితమే.. వైఎస్‌ భరోసా నిధులను విడుదల చేశారు సీఎం జగన్‌. ఇవాళ సీఎం వైయస్‌ జగన్‌ నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం రెండో విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జగన్‌.. నిధులను విడుదల చేశారు.

ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంవత్సరం లో రైతులకు 13500 రూపాయలు రైతు భరోసా అందిస్తున్నామన్నారు. కౌలు రైతులకు,అర్.ఓ.ఎఫ్.అర్ భూములు ఉన్న రైతులకు కూడా రైతు భరోసా అందిస్తున్నామని ప్రకటించారు. ఈ రోజు మొత్తం 2.23 లక్షల మంది రైతులకు 44.76 కోట్లు అందిస్తున్నామన్నారు. గతంలో ప్రభుత్వాలు రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని విమర్శలు చేశారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news