ఇవాళ నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన..

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నరసింహ ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలోనే నేడు సంతాప సభ జరగనుంది. కాగా ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాల్గొన్నారు.

ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 11 గంటలకు ఆయన హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి నార్కట్ పల్లి కి చేరుకొని అక్కడ నిర్వహించే సభలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించి వారితో మధ్యాహ్న భోజనం చేస్తారు సీఎం కేసీఆర్.

అనంతరం తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు ఇతర నాయకులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. కాగా నిన్న టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్లీనరీ సమావేశంలో రాష్ట్ర అలాగే దేశ రాజకీయాలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version