జైల్లో వేస్తే బలహీన పడతా అనుకున్నారు.. నేను 100 రెట్లు బలపడ్డా : కేజ్రీవాల్

-

ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన తీహార్ జైలు నుండి విడుదల అయ్యారు. ఇక భారీగా తీహార్ జైలు వద్దకు తరలి వచ్చిన ఆప్ కార్యకర్తలు, కేజ్రివాల్ అభిమానులు.. బయటకు వచ్చాక ఆయన ఏం మాట్లాడుతారు అని అందరూ అనుకుంటున్న సమయంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం కేజ్రీవాల్. మొదట భారత్ మాతకు జై అంటూ నినాదాలు చేసిన కేజ్రీవాల్.. నేను నిజాయితీ పరుడిని కాబట్టి దేవుడు నాకు మద్దతుగా నిలిచాడు అని పేర్కొన్నారు.

అలాగే కేజ్రీవాల్ ను జైల్లో వేస్తే బలహీన పడతాడు అనుకున్నారు.. కానీ నేను ఇప్పుడు 100 రెట్లు బలపడ్డా అని తెలిపారు. ఈ జైలు గోడలు నన్ను బలహీన పరచలేవు. ఈ దేశానికి నా సేవ కొనసాగిస్తా. దేశాన్ని అమ్మే ప్రయత్నాలకు, దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడుతా అని అన్నారు సీఎం కేజ్రీవాల్.

Read more RELATED
Recommended to you

Latest news