బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన సీఎం రేవంత్, బీజేపీ నేతల మీద హాట్ కామెంట్స్ చేశారు. ‘రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే సీఎం రేవంత్ ఢిల్లీకి పంపే మూటల లెక్కలు చెప్తున్నాడు. ఖర్గే, రాహుల్, ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్ కు డబ్బులు పంపే పనిలో రేవంత్ బిజీ. బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై రాజసింగ్ చేసిన కామెంట్స్ను ఎందుకు ఖండించటం లేదు.
రాజాసింగ్ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా?.. సోషల్ మీడియా అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థ.. అమెరికాలో ఉన్నవాడు ఇక్కడి రాజకీయాలు, ప్రభుత్వంపై కామెంట్ పెడితే..ఎలా శిక్షిస్తారు? రేవంత్ చెప్పాలి. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ గోడలు దూకుతాడో మాకు తెలవదా?.. సాగర్ సొసైటీలో ఎంత సమయం గడిపేవాడో కూడా తెలుసు.
ఇప్పటకీ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ..ఉదయ 5గంటలకు మై హోమ్ బూజాకు రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు. బీజేపీ నేతల బాగోతాలు కూడా నా దగ్గర ఉన్నాయి. పదేళ్ళు అధికారంలోకి ఉన్న మాకు ఎవరు ఎంటో అన్నీ తెలుసు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆందోళన అవుతుంటే.. రాహుల్ గాంధీ ఎందుకు స్పందించటం లేదు’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
అసెంబ్లీ:
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్ చాట్
రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే.. సీఎం ఢిల్లీకి పంపే మూటల లెక్కలు చెప్తున్నాడు
ఖర్గే, రాహుల్, ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్ కు డబ్బులు పంపే పనిలో రేవంత్ బిజీ
బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై రాజసింగ్ చేసిన… pic.twitter.com/bGktaSSKEj
— Telangana Awaaz (@telanganaawaaz) March 17, 2025