CM Revanth Reddy : ‘బంజారా చరిత్ర’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌ రెడ్డి

-

ఎన్నాళ్ల నుంచో లిఖిత చరిత్ర లేని బంజారా గిరిజన తెగ ఘనమైన చరిత్రను పుస్తకరూపంలో సమాజానికి అందించడం అభినందనీయమని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశంసించారు.ఉస్మానియా యూనివర్సిటీ మాజీ సీటీవో డాక్టర్‌ ధనంజయ్‌నాయక్‌ ,తెలుగు విభాగం ప్రొఫెసర్‌ సూర్యాధనంజయ్‌ సంయుక్తంగా రచించిన ‘బంజారా చరిత్ర’ పుస్తకాన్ని సీఎం బుధవారం ఆవిష్కరించారు. అనంతరం మొదటి ప్రతిని రచయితలు సీఎం రేవంత్‌రెడ్డికి అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి బంజారాల చరిత్ర ఎంతో గొప్పదని అన్నారు. బంజారాల చరిత్రను గ్రంథస్తం చేసేందుకు తోడ్పడిన రచయితలను అభినందించారు. అనంతరం రచయితలు మాట్లాడుతూ సీఎం చేతుల మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరింపజేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రచయితలు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసి, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడుపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news