CM Revanth Reddy : హైదరాబాద్‌ మెట్రో రెండో దశపై సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు..!

-

హైదరాబాద్‌ మెట్రో రెండో దశ ప్రతిపాదనకు సంబంధించిన డీపీఆర్‌, ట్రాఫిక్‌పై అధ్యయనం తొందరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.ప్రస్తుత పరిస్థితి, మెట్రోలైన్ పొడిగింపు, రెండోదశపై అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రస్తుతం ఉన్న మార్గాలు, కొత్త ప్రణాళికలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మియాపూర్‌-పటాన్‌చెరు, రాయదుర్గం-ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌,ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌,ఎంజీబీఎస్‌-ఎయిర్‌పోర్టు మార్గాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పాతబస్తీ మెట్రోపై స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. మతపరమైన, చారిత్రక కట్టడాలపై ఎలాంటి ప్రభావం పడకుండా మెట్రో విస్తరణ చేపట్టాలన్నారు.  రాయదుర్గం-ఎయిర్‌పోర్టు మెట్రో ప్రతిపాదనను పెండింగ్‌లో పెట్టాలని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news