Guntur Kaaram : ట్రెండ్ సెట్టర్ మహేష్ బాబు.. మొట్టమొదటిసారి అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్…..

-

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం. ఈ చిత్రం ఈనెల జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో మీనాక్షి చౌదరి, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి సాంగ్స్ కి మంచి స్పందన లభిస్తుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని త్వరలోనే రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహిస్తున్నారు.

 

ఇదిలా ఉంటే… విజయవాడ ,గుంటూరు లోని సినీ ప్రేక్షకులు ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే సినిమా టైటిల్ గుంటూరు కారం కావడంతో ఈ రెండు ప్రాంతాల అభిమానులు ఎదురు చేస్తున్నారు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో జనవరి 6 జరగనుంది అంట. ఆరోజే సినిమా ట్రైలర్ విడుదల చేస్తారట.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలోని కాలిఫోర్నియా సినీ లాంజ్ ఫ్రీమాంట్ సెవెన్ సినిమాస్ లో లైవ్ స్ట్రీమ్ కానుందట. ఇలా ఓ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడం తొలిసారి కావడంతో మహేష్ బాబు ట్రెండ్ సెట్టర్ గా నిల్వనున్నాడు

Read more RELATED
Recommended to you

Latest news