మహిళలకి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్..!

-

మహిళలకి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించిన నేపథ్యం లో కొత్తగా బస్సు లని ఆర్టీసీ అందుబాటు లోకి తీసుకు రావడం జరిగింది ఈరోజు 100 బస్సుల్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ బస్సులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ అనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటుగా ముఖ్యమంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పెరిగిన మహిళా ప్రయాణికుల సంఖ్య కి అనుగుణంగా మరో వెయ్యి బస్సులు కొంటామని అన్నారు. మహాలక్ష్మి పథకం నిధుల్ని ప్రతి నెల ఆర్టీసీ కి ప్రభుత్వం పంపుతుందని చెప్పారు. సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే మహిళలకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news