రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్లను నిరుపేదలకు అందజేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. మేనిఫెస్టోలోనూ ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పొందు పరిచింది. ఈ క్రమంలోనే ఆదివారం ఇందిరమ్మ ఇండ్లపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మొదటి దశలో అత్యంత నిరుపేదలకు, అర్హులకు మాత్రమే గృహాలను కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ పథకం పారదర్శకంగా, నిరుపేదలకు న్యాయం చేసేలా అమలు కావాలని అధికారులకు ఆదేశాలు సైతం జారీచేశారు. పథకంలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చూడాలని సూచనలు చేసినట్లు అధికార వర్గాల సమాచారం.
ఇందిరమ్మ ఇండ్లపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి
ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మొదటి దశలో అత్యంత నిరుపేదలకు, అర్హులకు మాత్రమే గృహాలను కేటాయించాలని సీఎం రేవంత్ స్పష్టం.
ఈ పథకం పారదర్శకంగా, నిరుపేదలకు న్యాయం చేసేలా అమలు కావాలని అధికారులకు ఆదేశాలు.
పథకంలో ఎలాంటి… pic.twitter.com/Hwr0HcWRTd— ChotaNews App (@ChotaNewsApp) April 13, 2025