ప్రతి తల్లి రెండు మొక్కలు పెంచాలి: సీఎం రేవంత్

-

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ మొక్కలు నాటాలని పేర్కొన్నారు. ఈ సంవత్సరం 18 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

revanth reddy
revanth reddy

వన మహోత్సవం సందర్బంగా రుద్రాక్ష మొక్కను నాటారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవం కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. యూనివర్సిటీ ప్రాంగణంలో రుద్రాక్ష మొక్కను నాటి వన మహోత్సవాన్ని ప్రారంభించారు. అటవీ శాఖ, HMDA ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు.

Read more RELATED
Recommended to you

Latest news