బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం

-

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.బీసీ రిజర్వేషన్ల పెంపనకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవాళ పంచాయతీరాజ్ శాఖపై ముఖ్యమంత్రి రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

రిజర్వేషన్ల పెంపు అంశంపై డిప్యూటీ సీఎం ,మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, సీతక్క, కొండా సురేఖ, మాజీ మంత్రి జానారెడ్డి, సీఎం సలహాదారు వేంనరేందర్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, సిఎస్ శాంతికుమారి, ఇతర అధికారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా ఈ విషయంలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లోగా మరోసారి సమావేశం కావాలని తెలిపారు.జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేసి బీసీ కులాలకు న్యాయం చేస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చిన మేరకు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే మార్చి నెలలో కులగణనకు జీవో నెం. 26 జారీ చేసింది. ఇంతలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ మొదలు కావడంతో ప్రక్రియ ఆలస్యం అవుతున్నది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ ఇవాళ సమీక్ష నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news