ఎన్నికలప్పుడు ఒక మాట.. అధికారంలోకి వచ్చాక ఒక మాట.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలను మాఫీ చేసేందుకు మార్గదర్శకాలు రిలీజ్ చేసింది.ప్రభుత్వం విడుదల చేసిన ఈ మార్గదర్శకాలపై హరీష్ రావు స్పందించారు.ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ… రైతుల వలపోతల కంటే వడపోతల పైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నది స్పష్టం అని మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట.. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనే పద్ధతి చెయ్యి గుర్తు పార్టీకి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.

డిసెంబర్ 12, 2018 వరకు ముందున్న రైతులకు వర్తించదు అనే నిబంధన అసమంజసం అని అన్నారు. రైతుకు రుణ భారం తగ్గించే ప్రయత్నం కన్నా ప్రభుత్వ భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువ కనపడుతున్నదని మండిపడ్డారు .ఆహార భద్రత కార్డు, పీఎం కిసాన్ పథకం ప్రామాణికం అని ప్రకటించడం అంటే లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నికలప్పుడు మభ్య పెట్టారని, అధికారం చేజిక్కినాంక ఆంక్షలు పెట్టారని ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news