ఆ రైతులకు రుణమాఫీ వర్తించదు.. మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలను మాఫీ చేసేందుకు మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. తాజాగా విడుదలైన గైడ్ లైన్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో భూమితో పాటు రేషన్ కార్డు ఉన్న ప్రతి రైతుకు 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 లోపు తీసుకున్న లోన్, వడ్డితో కలిపి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయనున్నట్లు వెల్లడించారు.

 

తాజాగా ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. పలు లోన్లకు రుణమాఫీ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు ఎస్‌హెచ్‌జిలు, జెఎల్ జీలు, ఎల్ఇసీఎస్ లకు తీసుకున్న రుణాలకు రుణమాఫీ వర్తించదు. దీంతో పాటు వివిధ కంపెనీలు, ఫర్మ్స్ వంటి సంస్థలకు ఇచ్చిన పంట రుణాలు కూడా రుణమాఫీ వర్తించదు. అలాగే పునర్‌వ్యవస్థికరించిన, రీషెడ్యూల్ చేసిన రుణాలకు కూడా ఈ రుణమాఫీ వర్తించదు.కానీ పీఏసీఎస్‌ల ద్వారా తీసుకున్న పంట రుణాలకు రుణమాఫీ వర్తిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news