CM Revanth Reddy’s visit to Karimnagar and Nizamabad districts today: కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అయితే.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇవాళ ఉదయం 11.50 గంటలకు నిజామాబాద్ సభలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

అలాగే… ఇవాళ మద్యాహ్నం 2.20 గంటలకు మంచిర్యాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం 4.25 గంటలకు కరీంనగర్ కు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. అక్కడ కూడా ప్రచారం చేస్తారు.