FLASH : మాజీ ఎమ్మెల్సీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి మృతి..!

-

మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు జ‌గ‌దీశ్వ‌ర్‌ రెడ్డి క‌న్నుమూశారు. అనారోగ్యంతో గ‌త కొంత‌కాలంగా హైద‌రాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌న ప‌రిస్థితి విష‌మించ‌డంతో శుక్ర‌వారం తుది శ్వాస విడిచారు.  ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి తెలిపారు. జ‌గ‌దీశ్వ‌ర్ ‌రెడ్డి మృతిప‌ట్ల ప‌లువురు సంతాపం వ్య‌క్తం చేశారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆకాంక్షించారు. ఇకపోతే జగదీశ్వర్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు.

అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డీసీసీ అధ్యక్షునిగా, పీసీసీ, ఏఏఐసీసీలల్లో కీలక పదవులను చేపట్టారు. అదేవిధంగా తొలి దశ తెలంగాణ ఉద్యమంలో జిల్లా నుంచి ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఆయన టీఆర్ఎస్ గూటికి చేరారు. కానీ, అక్కడ ఇమడలేక తిరిగి మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version