హుజురాబాద్ లో భారీ మెజార్టీతో గెలుస్తాం ; కాంగ్రెస్ అభ్యర్థి

-

యాదాద్రి : హుజురాబాద్ ను భారీ మెజార్టీ తో కాంగ్రెస్ కైవసం చేసుకుంటామని.. హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్ధి& ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్ముర్‌ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన యాదాద్రిలో పర్యటించారు. ఈ సందర్బంగా వెంకట్‌ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధించుకుంది విద్యార్థుల కోసం , నిరుద్యోగుల కోసమని కానీ టీఆర్‌ఎస్‌ పార్టీ పాలనలో అందరికీ అనాయ్యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు వెంకట్‌.

కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల కోసo జంగ్ సైరన్ లో భాగంగా తన కు హుజురాబాద్ నియోజక వర్గ టికెట్ ఇచ్చి ప్రోత్సహించిందన్నారు. తన గెలుపు కోసం కార్యకర్తలందరూ కష్టపడాలని పిలుపునిచ్చారు. యువతను ప్రోత్స హించడానికి తనకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని వెల్లడించారు. టికెట్‌ ఇచ్చిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు వెంకట్‌. కాగా హుజురాబాద్‌ నియోజక వర్గ ఉప ఎన్నిక ఈ నెల 30 వ తేదీన జరుగుతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version