ముందస్తుపై కాంగ్రెస్ కసరత్తు

-

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికిప్పుడు ముందస్తు వస్తే రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఎలాంటి కార్యచరణ రూపొందించుకోవాలి, క్షేత్ర స్థాయిలో తెరాస వైఖరిని ఏ విధంగా ఎండగట్టాలనే విషయాలపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ కుంతియాతో కాంగ్రెస్ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. హైదరాబాద్ గోల్కొండ హోటల్లో సోమవారం రాత్రి సమావేశమయ్యారు. ప్రధాన నగరాల్లో పట్టు సాధించడంతో పాటు, అధికార తెరాస ఎత్తుగడలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు  చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి, షబ్బీర్ అలీ, రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news