కర్నూలు: యూట్యూబ్ ఛానల్ విలేఖరిపై కానిస్టేబుల్ ఘాతుకం..

-

జర్నలిస్టుల హత్యలు దేశాన్ని కలచివేస్తున్నాయి. ప్రజల తరపున ప్రశ్నించినందుకు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటన ఇలాంటిదే. కేశవులు అనే యూట్యూబ్ విలేఖరిని సస్పెండ్ అయిన కానిస్టేబుల్ హత్య చేసాడు. స్క్రూ డ్రైవర్ తో పొడిచి చంపేసాడు. మూడేళ్ళుగా యూట్యూబ్ ఛానల్ విలేఖరిగా పనిచేస్తున్న కేశవులు, స్థానిక వార్తలను ప్రజలకు చేరవేసేవారు. వివరాల్లోకి వెళితే కొన్ని రోజుల క్రితం పేకాట ఆడుతూ దొరికిన వెంకట సుబ్బయ్య,సస్పెండ్ కాబడ్డాడు.

తాను సస్పెండ్ అవడానికి కారణం కేశవులే అని అనుమానించిన వెంకట సుబ్బయ్య మాట్లాడాలని ఉందని పిలిచి స్క్రూ డ్రైవర్ తో పొడిచి హత్య చేసాడు. గతంలో వెంకట సుబ్బయ్యకి గుట్కా వ్యాపారులతో సంబంధం ఉన్నట్లు ఫోన్ సంభాషణలు వైరల్ అయ్యాయి. వీటన్నింటినీ మనసులో పెట్టుకుని పగ పెంచుకున్న వెంకట సుబ్బయ్య, కేశవులుని హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news