రూ.71 కోట్లతో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నూతన భవన నిర్మాణం

-

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నూతన భవనానికి స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి శంఖు స్థాపన చేశారు. 71 కోట్లతో సిటీ ఆపరేషన్ భవనం పేరుతో ఈ నిర్మాణం చేపడుతున్నారు. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిధులతో నిర్మాణం చేయనుండగా… ఏడాదిన్నరలోపు భవన నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది వైసీపీ సర్కార్‌.

ఈ సందర్బంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ.. వినతులు ఇచ్చేందుకు వచ్చే వారికి ఇబ్బంది లేకుండా నూతన భవనం నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. లక్షా అరవై వేల అడుగుల్లో కార్పొరేషన్ కార్యాలయం నిర్మాణం ఉంటుందని తెలిపారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ భవనం ఉపయోగపడుతుందని వివరించారు. తిరుపతి నగరానికి ఆశా దీపం ఈ భవనమని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తిరుపతికి ఇచ్చిన కానుక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం అని వివరించారు. 18 నెలల కాల వ్యవధి ఉన్నా 15 నెలల్లో కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయాలని కోరుతున్నానన్నారు భూమన కరుణాకరరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news