పబ్జీ ఫ్రీ ఫైర్ గేమ్ కోసం విద్యార్థులు గొడవ పడ్డారు. ఈ ఘటన ఏపీలోని ఏలూరులో బుధవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. కొందరు విద్యార్థులు పబ్జీ గేములో ఫ్రీ ఫైర్ ఆడే సమయంలో గొడవకు దిగినట్లు తెలిసింది.
ఆ వివాదం కాస్త ముదరడంతో ఏలూరులోని జిల్లా పరిషత్ పాఠశాల ఎదురుగా గల రోడ్డులో గుంపులుగా ఏర్పడిన విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం విద్యార్థులను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చి త్రీటౌన్ పోలీసులు ఇళ్లకు పంపించారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఏలూరులో విద్యార్థుల మధ్య ఘర్షణ.
జిల్లా పరిషత్ ఎదురు రోడ్లో గుంపులుగా ఒకరిపైఒకరు దాడి.
ఫ్రీ ఫైర్ గేమ్ వివాదంలో విద్యార్థుల మధ్య చెలరేగిన వివాదం.
సంఘటన స్థలానికి చేరుకున్న విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపిన త్రీటౌన్ పోలీసులు. #AndhraPradesh #eluru #students #fight… pic.twitter.com/m8cTy2qpBw
— RTV (@RTVnewsnetwork) February 19, 2025