ప్రపంచవ్యాప్తంగా కోటిన్నర దాటిన కరోనా కేసులు..!

-

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభ‌ణ‌ కొనసాగిస్తుంది. ఈ మహమ్మారి రోజు రోజుకు తన దూకుడు పెంచుతూ వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి బారినపడిన వారి సంఖ్య ఇప్పటికే కోటి 50లక్షలు దాటింది. అగ్రరాజ్యం అమెరికా, బ్రెజిల్‌, భారత్‌ దేశాల్లో ఈ మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉన్నది. ఈ మూడు దేశాల్లో కరోనా ఉధృతి ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా లేదు. ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.

coronavirus
coronavirus

అయితే బుధవారం మధ్యాహ్నం వరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 1,50,99,660కుపెరిగింది. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 6,19,609కు చేరింది. అమెరికా 40,28,569 కేసులు, బ్రెజిల్ ‌21,66,532, భారత్‌ 11,94,888, రష్యా 7,83,328 దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నదని సమాచారం. ఒక్క అమెరికాలోనే 1,44,953 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్‌లో 81,597 మంది, ఇండియాలో 28,771, మెక్సికోలో 40,400 మంది వైరస్‌ కారణంగా చనిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news