బ్రేకింగ్ ; ఏపీ లో ఒక్కరోజే 75 కరోనా పాజిటివ్ కేసులు …!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు అత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి. తాజాగా ఏపీలో 75 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 75 గా ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో 92 మంది కరోనా వైరస్ నుంచి కోలుకోగా కేసుల సంఖ్య 722 గా ఉంది. మొత్తం 20 మంది కరోనా కారణంగా మరణించారు.

చిత్తూరులో 25 మందికి కరోనా సోకింది. గుంటూరులో 20 కేసులు బయటపడ్డాయి. కర్నూలు జిల్లాలో 16 కేసులు నమోదు అయ్యాయి. కృష్ణాలో 5 కేసులు కడపలో 3 కేసులు నమోదు అయ్యాయి. అనంతపురం నాలుగు కేసులు నమోదు కాగా తూర్పు గోదావరి లో 2 కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ కరోనా కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 610 గా ఉన్నాయి. ఒక్కసారిగా 75 కేసులు నమోదు కావడంతో ఏపీ సర్కార్ లో అలజడి మొదలయింది. ఇప్పటి వరకు తక్కువగా ఉన్నాయని భావించిన ఏపీ సర్కార్ కూడా ఇన్ని కేసులు నమోదు కావడంతో కంగారు పడుతుంది. లాక్ డౌన్ సడలింపులు వద్దు అని భావిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version