మరో వైసీపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్…!

-

ఆంధ్రప్రదేశ్ లో మరో వైసీపీ ఎమ్మెల్యే కి కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయనకు కరోనా లక్షణాలు ఉండటంతో ఒంగోలు లోని రమేష్ సంఘమిత్ర వైద్యశాలలో పరీక్షలు చేయించుకున్నారు. ఆయన సతీమణి కూడా కరోనా పరిక్షలు చేయించుకోగా ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. అనుమానంతో కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేయించుకోగా వారికి నెగటివ్ వచ్చింది.

నెల రోజుల క్రితం అన్నా మనవడికి పాజిటివ్ వచ్చింది. మనవడికి ఒంగోలు లోనే చికిత్స చేయించారు. ఇటీవల ఎమ్మెల్యే గారి పుట్టిన రోజు వేడుకలు జరగగా ఆయన పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమాల్లో పలువురు నేతలు, జిల్లాకు చెందిన ఒక మంత్రి కూడా పాల్గొన్నారు కీలక నేతలను ఎమ్మెల్యే కలిసినట్టు తెలుస్తుంది. ఆయన పలు మీడియా సంస్థలతో కూడా మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news