తెలంగాణా ఛీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కి కరోనా పాజిటివ్..

-

తెలుగు రాష్ట్రాల్లో కరోనా భారీ విధ్వంసం సృష్టిస్తోంది. ఏపీలో రోజూ ఐదు వేలకు చేరువలో కేసులు నమోదు అవుతుండగా భారీగానే మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఏపీతో పోలిస్తే తెలంగాణాలో కాస్త తక్కువే అయినా ఇక్కడి కేసుల సంఖ్య కూడా ఎక్కువే నమోదు అవుతోంది. ఈ వైరస్ ఇప్పుడు వరుసగా ప్రముఖులకి కూడా సోకుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఎమ్మెల్యేలు, నేతలు ఈ వైరస్ బారిన పడగా ఇప్పుడు మరో కీలక నేతకు కరోన సోకింది. తెలంగాణా ఛీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ఈరోజు తెలంగాణా అసెంబ్లీ సమావేశం కానున్న నేపధ్యంలో అందరితో పాటు ఆయనకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హోమ్ క్వరెంటైన్ కి వినయ్ భాస్కర్ వెళ్ళారు. అయితే తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, కానీ ఈ మధ్య కాలంలో తనని కలిసిన వారు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని వినయ్ భాస్కర్ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news