Breaking : రాహుల్‌ గాంధీకి కరోనా పాజిటివ్

-

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు కల్లోలం సృష్టిస్తున్నాయి. పేద, ధనిక తేడాలు లేకుండా అందరినీ చుట్టేస్తోంది కరోనా. తాజాగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, యువ నేత రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని..ఆ పరీక్షలలో కోవిడ్-19 పాజిటివ్‌గా తేలిందని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా కరోనా నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని రాహుల్ గాంధీ సూచించారు. ఇక నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఈ దెబ్బతో మొత్తం ఐదుగురు ముఖ్యమంత్రులకు కరోనా సోకినట్టు అయింది. 

Read more RELATED
Recommended to you

Latest news