రాష్ట్రంలో స్వ‌ల్పంగా త‌గ్గిన క‌రోనా.. నేడు 3,590 కేసులు

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి కాస్త త‌గ్గుముఖం ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తుంది. రోజు రోజుకు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య త‌గ్గుతు వ‌స్తుంది. నిన్న‌టితో పోలిస్తే.. శ‌నివారం దాదాపు 300 వ‌ర‌కు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య త‌గ్గింది. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుద‌ల చేసిన క‌రోనా బులిటెన్ ప్ర‌కారం ఈ రోజు 3,590 క‌రోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన కేసుల సంఖ్య 7,58,566 కు చేరింది.

అలాగే గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా మ‌హమ్మారి వ‌ల్ల ఇద్ద‌రు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు కరోనా వ‌ల్ల మ‌రణించిన వారి సంఖ్య 4,085 కి చేరుకుంది. అలాగే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 3,555 మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం 40,447 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగ గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా 95,355 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version