భారత్ లో కరోనా ఉగ్రరూపం.. 1 మిలియన్ దాటిన కేసులు..!

-

భారత్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. కాగా.. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 34,956 కరోనా కేసులు నమోదవ్వగా, మొత్తం 687 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

 

దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,03,832కు చేరుకోగా మరణాల సంఖ్య 25,602కి చేరుకుంది. కరోనా నుంచి ఇప్పటి వరకు మొత్తం 6,35,756 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 3,42,473 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version