తెలంగాణ సచివాలయంలో కరోనా కలకలం..!

-

తెలంగాణలో మొదట్లో కాస్త అదుపులో ఉన్న కరోనా ఇప్పుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంది. రోజురోజుకి తీవ్రంగా మారుతుంది. సామాన్య ప్రజలే కాదు, రాజకీయ నాయకులు సైతం దీని బారిన పడుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల నేపధ్యంలో కరోనా తీవ్రత పెరిగిందని చెప్పొచ్చు. అలాగే తెలంగాణ సచివాలయంలో ఉద్యోగులను కూడా కలవరపెడుతోంది ఈ కరోనా వైరస్. తాజాగా ఆదివారం టీఎస్ సెక్రటేరియట్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ మహిళ ఐటీ శాఖలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా విధులు నిర్వహిస్తుంది. దీంతో అధికారులు సచివాలయంలో శానిటైజేషన్ చేయించారు. అలాగే ఆమెతో ఇంటరాక్ట్ అయిన మిగిలిన ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version