తెలుగు రాష్ట్రాల్లో వేగంగా పెరుగుతున్న కరోనా…!

-

తెలంగాణా లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. తెలంగాణాలో ఇప్పటి వరకు 154 మందికి కరోనా వైరస్ సోకింది. వీరిలో 17 మందికి కరోనా వైరస్ నయం కాగా నిన్న ముగ్గురు కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక నిన్న ఒక్క రోజే 27 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు 149 కి చేరుకున్నాయి. విజయవాడలో ఒక ఇంట్లోనే 7 మందికి కరోనా వైరస్ సోకింది. ముఖ్యంగా ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు అందరికి ఇప్పుడు కరోనా వైరస్ సోకడంతో అధికారులు వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. రెండు రాష్ట్రాల నుంచి భారీగా వెళ్ళారు. వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు ప్రాంతంలో తీవ్రంగా గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news