ఇమ్యూనిటీ బూస్టర్​ ‘ఆయుష్​ చిక్కీ’తో కరోనా పరార్​!

-

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ వైరస్​ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ రోగనిరోధక శక్తిని పెంచుకునే దారులు వెతుకుతున్నారు ప్రజలు. ఇదే సమయంలో ఆయుర్వేద సంస్థలు రోగనిరోధక శక్తిని పెంచే ఔషధాలను తయారుచేస్తున్నాయి. బాబా రాం​దేవ్​, బాలకృష్ణలకు చెందిన పతాంజలి సహా పలు సంస్థలు.. ఇప్పటికే ఇమ్యూనిటీ బూస్టర్​ను మార్కెట్లోకి తీసుకొచ్చాయి.
తాజాగా కర్ణాటక మంగళూరుకు చెందిన ప్రముఖ ఆయుర్వేద ఉత్పత్తుల రీటైలర్​ వివేక్​ ట్రేడర్స్.. ‘ఆయుష్​ చిక్కీ’ పేరుతో​ సరికొత్త ఇమ్యూనిటీ బూస్టర్​ను ఆవిష్కరించింది. దీనిని తులసి​, అల్లం సహా పలు మిశ్రమాలతో తయారు చేసింది. ఈ పౌడర్​ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి.. కరోనా రాకుండా అడ్డుకుంటుందని సంస్థ పేర్కొంది.

AYUSH chikki
AYUSH chikki

ఆయుష్​ చిక్కీని ఇప్పటికే మంగళూరులో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది వివేక్​ ట్రేడర్స్​. కేవలం రూ.20లకే అందిస్తోంది. ఈ ఇమ్యూనిటీ బూస్టర్​పై చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని సంస్థ చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news