కర్ణాటకను కమ్మేసిన కరోనా ..!

-

కర్ణాటకలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతుంది. తాజాగా కర్ణాటక ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల వివరాలను హెల్త్ బులిటెన్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇక నేడు కొత్తగా 2228 కేసులు నమోదువ్వగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 31,105 కేసులు నమోదయ్యాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 17,782 కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి.

carona karnataka
carona karnataka

మరోవైపు నేడు రాష్ట్రవ్యాప్తంగా 955 మంది కరోనా బారి నుండి కోలుకొని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీనితో నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 12,833 మంది కరోనా నుండి బయటపడ్డారు. అలాగే నేడు 17 మంది రాష్ట్రవ్యాప్తంగా మరణించగా, ఈ సంఖ్య తో నేటి వరకు రాష్ట్రంలో నమోదైన మరణాల సంఖ్య 486 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ గా ఉన్న కేసులలో 457 మందికి పరిస్థితి విషమించడంతో వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

Read more RELATED
Recommended to you

Latest news