24గంట‌ల్లో 60,975 క‌రోనా కేసులు భార‌త్‌లోనే..

-

భార‌త్‌లో క‌రోనా వైర‌స్ విజృంభ‌న కొన‌సాగుతోంది. రికార్డుస్థాయిలో కేసులు న‌మోదు అవుతున్నాయి. గ‌త 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 60,975 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,164,881కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే 848 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 58,546కు చేరుకుంది. దేశంలో కేవ‌లం ఐదారు రాష్ట్రాల్లోనే అత్య‌ధికంగా కేసులు న‌మోదు అవుతున్నాయి.

మ‌హారాష్ట్ర‌(693,398), త‌మిళ‌నాడు(385,352), ఆంధ్ర‌ప్ర‌దేశ్‌(345,216), క‌ర్నాట‌క‌ (283,665), ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌(192,000) కేసులు న‌మోదు అయ్యాయి. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 23,800,692మంది వైర‌స్ బారిన ప‌డ్డారు. 16,347,833మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 816,534మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. అమెరికాలో 5,914,682కేసులు, బ్రెజిల్‌లో 3,627,217 కేసులు న‌మోదు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news