భారత్ లో లంచాలు తగ్గాయి… తాజా సర్వే ఏం చెప్పింది…?

-

గత ఏడాదిలో భారత్ లో లంచం తీసుకునే వారి సంఖ్య 10 శాతం తగ్గిందని ఒక సర్వేలో వెల్లడైంది. సాధారణంగా భారత్ లో లంచం లేనిదే ఏ పని జరగదు అనేది వాస్తవం. చిన్న చిన్న పనులకు కూడా భారత్ లో లంచం డిమాండ్ చేస్తూ ఉంటారు కొందరు ప్రబుద్దులు. దాదాపు అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో పరిస్థితి ఇదే విధంగా ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకల్ సర్కిల్స్ మరియు స్వతంత్ర అవినీతి నిరోధక న్యాయవాదులు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా (టిఐఐ) నిర్వహించిన ఒక సర్వేలో,

గత సంవత్సరంలో లంచం సంఘటనలు 10% తగ్గాయని తేలింది.భారతదేశంలో ప్రతి ఇద్దరు వ్యక్తులలో ఒకరు గత సంవత్సరంలో కొంత లంచం చెల్లించారని సంస్థ పేర్కొంది. ఈ సర్వేలో 51% మంది ప్రతివాదులు తాము కొంత లంచం ఇచ్చినట్లు అంగీకరించారు. ఈ సర్వే భారతదేశంలోని 20 రాష్ట్రాలలో 190,000 శాంపిల్స్ సేకరించింది. గత 12 నెలల్లో 24% మంది తాము చాలా సార్లు లంచం తీసుకున్నట్లు అంగీకరించారు, మిగిలిన 27% మంది ఒకసారి లేదా రెండుసార్లు మాత్రమే తీసుకున్నామని సర్వేకి చెప్పారట.

సుమారు 19% మంది ప్రతివాదులు తమ లంచం చాలావరకు పోలీసులకు చెల్లించారని సర్వే వెల్లడించింది. ప్రజలు పన్ను శాఖ, రవాణా కార్యాలయం, మునిసిపల్ కార్పొరేషన్ మరియు ఇతర స్థానిక సంస్థలకు లంచం ఇచ్చినట్లు కూడా నివేదికలో తేలింది. ప్రభుత్వం తీసుకున్న కొత్త చర్యలు “కొన్ని ప్రభావాలను చూపించడం ప్రారంభించాయి” అని నివేదిక తెలిపింది. 6% మంది మాత్రమే తమ స్థానిక ప్రభుత్వం అవినీతిని తగ్గించడానికి చర్యలు తీసుకున్నారని చెప్పారు. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ప్రకారం, ప్రభుత్వ రంగ అవినీతి స్థాయిలో భారతదేశం 41 స్కోరును కలిగి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news