తెలంగాణలో పత్తి కొనుగోళ్లు ప్రారంభం..

-

రాష్ట్రంలో సీసీఐ పత్తి కొనుగోళ్లను ప్రభుత్వం ప్రారంభించింది. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో పత్తి కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రాజర్షిషా, ఎమ్మెల్యే,ఎంపీలు కలిసి ప్రారంభించారు. ఈ మార్కెట్లో సుమారు 11 కాంటాలను ఏర్పాటు చేశారు. అయితే, పత్తికి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7,521 ప్రకటించింది. 8 శాతం తేమ ఉంటే క్వింటాల్ కు రూ.7,521 మద్దతు ధర దొరుకుతుందని తెలిపింది. సీసీఐతో పాటు ప్రైవేట్ వ్యాపారులు కూడా కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తారు.

రైతులకు ఇబ్బందులు ఎదురైతే పరిష్కరించేందుకు మల్టీ కంట్రోల్ కమిటీలను సైతం ఏర్పాటు చేశారు. కరీంనగర్, వరంగల్ సహా జిల్లాల్లో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మరోవైపు వరంగల్ ఏనమాముల మార్కెట్‌లో పత్తికి తక్కువ రేటు ఇవ్వడం రైతులు నిరసన తెలిపారు.దీంతో కాంటాలను రైతులు నిలిపివేశారు.కాగా, గుజరాత్ తరహాలో క్వింటాల్ పత్తికి రూ.8,800 ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ధర తక్కువగా ఉండటంతో కనీసం పెట్టుబడి రాదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news