ఛత్తీస్‌గఢ్‌లో దిల్లీ ఘటన.. స్కూటీని ఈడ్చుకెళ్లిన కారు.. దంపతుల మృతి

-

దిల్లీలో ఓ యువతిని కారు ఈడ్చుకెళ్లిన ఘటన మరువకముందే అలాంటి మరో దారుణం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దుర్గ్‌ జిల్లాలో జరిగింది. స్కూటీపై వెళ్తున్న భార్యాభర్తలను ఓ కారు బలి తీసుకుంది. పుల్గావ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివసించే జ్ఞాన్‌చంద్‌ లేఖ్వాని (56), వందన (45) దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. జ్ఞాన్‌చంద్‌ తన భార్యతో కలిసి ఓ సంగీత కచేరీకి హాజరై అర్ధరాత్రి స్కూటీపై ఇంటికి తిరిగి వస్తుండగా.. వేగంగా వచ్చిన ఓ కారు వెనుక నుంచి స్కూటీని బలంగా ఢీకొట్టింది.

దంపతులు ఇద్దరినీ ఈడ్చుకొంటూ 300 మీటర్ల వరకు వెళ్లి.. ఓ వంతెన రక్షణగోడను బలంగా తాకింది. తీవ్రంగా గాయపడ్డ జ్ఞాన్‌చంద్‌ దంపతులు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఎయిర్‌బ్యాగ్స్‌ తెరుచుకోవడంతో కారులో ఉన్నవారికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరగ్గానే కారు డ్రైవరు పారిపోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news