ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆరోగ్య పరిస్థితి విషమం

-

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా నిన్న అస్వస్థతకు గురయ్యారు. కరోనా బారినపడిన ఆయన ఈ నెల 14 నుంచి హోం క్వారంటైన్‌లో ఉంటున్నాడు. నిన్న ఆయనకు తీవ్ర జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ఆయన్ని లోక్‌ నాయక్‌ హాస్పటల్‌ లో చేర్చారు. ఆయనను ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. సిసోడియా ఆరోగ్య పరిస్థితి విషమంగ ఉందని అంటున్నారు. ఈ నెల 14న ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది.

అది కాక డెంగ్యూ కూడా సోకడంతో తీవ్ర ఆరోగ్య సమస్యలు ఆయనని వేధిస్తున్నాయి. ఇక ఈరోజు కొద్దిసేపటి క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం “లోక్ నాయక్ జయప్రకాష్” (ఢిల్లీ ప్రభుత్వ హాస్పటల్ ) హాస్పిటల్ నుంచి మ్యాక్స్ ప్రైవేట్ హాస్పటల్ కు తరలించారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 60 వేలు దాటింది. దేశ రాజధానిలో గడచిన 24 గంటలలో 3,834 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news