సీఎం అయ్యాక జగన్ గుణం మారిపోయింది – CPI నారాయణ

-

సీఎం అయ్యాక జగన్ గుణం మారిపోయిందని CPI నారాయణ విమర్శలు చేశారు. అమరావతి లోని వెంకటపాలెం గ్రామంలో రైతుల పాదయాత్ర లో బిజేపి నాయకులు కామినేని శ్రీనివాస్, టిడిపి ఏలూరు మాజీ ఎంపీ మాగంటి, సీపీఐ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. అమరావతి రైతుల రెండవ పోరాటమని చెప్పారు.

జగన్ అమరావతి రాజధాని అని హామీ ఇచ్చారు సీఎం అయ్యారు.. సీఎం అయ్యాక జగన్ గుణం మారిపోయిందని ఆగ్రహించారు.రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. పాదయాత్రలు, ర్యాలీలు అంటే సీఎంకు ఎందుకు కోపం… సీఎం పదవి నుండి జగన్ దిగిపోవాలని రైతులు పాదయాత్ర చేయట్లేదు…అమరావతి రాజధాని కావాలనే చేస్తున్నారని తెలిపారు. మీరు మీ నాన్న పాదయాత్రలు చేసే సీఎంలు అయ్యారని.. పరిస్థితులు ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు CPI నారాయణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version