మహేశ్ బాబు సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో కీ రోల్..త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్

-

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘మాటల మాంత్రికుడు’గా పేరు గాంచాడు. ఈయన దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ‘అతడు, ఖలేజా’ చిత్రాలు ప్రేక్షకులు మరిచిపోలేరు. ఈ సినిమాలు టీవీల్లో వస్తున్నాయంటే చాలు..టీవీలకు అతుక్కుపోతుంటారు. అంతటి క్రేజ్ ఈ కాంబినేషన్ కు ఉండగా, చాలా కాలం తర్వాత మహేశ్- త్రివిక్రమ్ కలిసి పని చేస్తున్నారు.

వీరిరువురి కాంబోలో SSMB28 ఫిల్మ్ రాబోతుండగా, ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. త్వరలో ఈ చిత్ర షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. కాగా, ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్, స్టార్ హీరోను తీసుకొస్తారని వార్తలొస్తున్నాయి.

స్టోరిలో ఓ కీ రోల్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ ను సెలక్ట్ చేశాడని టాక్. ఈ క్రమంలోనే మూవీ యూనిట్ సభ్యులు అనిల్ కపూర్ కు ఈ విషయమై సంప్రదిస్తారట. అనిల్ కపూర్ ఓకే చెప్తారో లేదో మరి..

ఈ చిత్రం తెలుగు భాషలోనే కాకుండా పాన్ ఇండియా లెవల్ లో ప్లాన్ చేయాలనే ఆలోచనలోనూ త్రివిక్రమ్, మూవీ మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి..ఏం జరుగుతోంది. ఈ చిత్రంలో మహేశ్ బాబుకు జోడీగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆస్థాన హీరోయిన్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version