పవర్ స్టార్ అభిమానులకి క్రేజీ న్యూస్.. త్రివిక్రమ్ వచ్చేస్తున్నాడు..

-

పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ ల మధ్య ఎంత గొప్ప స్నేహం ఉందో అందరికీ తెలుసు. వారిద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి. అందులో అజ్ఞాతవాసి వదిలేస్తే మిగతా రెండు సినిమాలు మంచి హిట్లుగా నిలిచాయి. ఐతే ప్రస్తుతం వీరిద్దరి కలయికలో మరో సినిమా రూపొందుతుంది. రాజకీయాల్లో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్, ఇటు సినిమాలు కూడా చేస్తున్నాడు. ఆల్రెడీ లైన్లో ఉన్న నాలుగు సినిమాల్లో ఒకానొక సినిమాకి త్రివిక్రమ్ పనిచేస్తుండడం విశేషం.

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకి త్రివిక్రమ్ కథనం అందించడంతో పాటు మాటలు రాస్తున్నాడు. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ కి త్రివిక్రమ్ మాటలు రాస్తున్నాడు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా చేసారు. మళయాలంలో సూపర్ హిట్ అనిపించుకున్న అయ్యప్పనుమ్ కోషియం సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ పనిచేయడం పవన్ అభిమానులకి మంచి హుషారునిచ్చే వార్తే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news