కులాంతర వివాహం…కూతురికి గుండు కొట్టించి..!

-

దేశంలో ఇపటికీ సామాజిక వర్గాల పేరుతో అసమానతలు కనిపిస్తూనే ఉన్నాయి. టెక్నాలజీ పరుగులు తీస్తున్నా ..మనిషి చంద్రుడి పైకి ఎక్కుతున్నా బుద్ది మాత్రం ఇంకా కిందికే వెళుతోంది. ప్రేమ వివాహాలు చేసుకున్నారని దాడులు చేయడం…వారిని హింసించడం కనిపిస్తూనే ఉంది. తాజాగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో ఓ తండ్రి తన కూతురుకు గుండు కొట్టించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో ని బేతుల్ జిల్లాలో చోటు చేసుకుంది.

సాక్షి యాదవ్ అనే నర్సింగ్ విద్యార్థిని తన తో పాటు కాలేజీలో చదువుతున్న అమిత్ అహిర్వాల్ అనే విద్యార్థితో ప్రేమలో పడింది. ఇద్దరి మనసులు కావడంతో కలిసి జీవించాలని పెళ్లి చేసుకున్నారు. అయితే యువకుడు దళితుడు అనే కారణం చెప్పి కులాంతర వివాహం చేసుకున్న కూతురుకు తండ్రి గుండు కొట్టించాడు. అనంతరం పుణ్యస్నానం చేయించాడు. ఈ విషయం పై యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం తో యువతిని తండ్రి వద్ద నుండి విడిపించి ఇద్దరిని కలిపారు. యువతి తండ్రి పై కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news