త‌ల్లి త‌న‌కు ఇష్టంలేనిహెయిర్‌కట్ చేయించింద‌ని ఓ యువ‌కుడు ఏం చేశాడో తెలుసా..?

-

ఇటీవ‌ల కాలంలో చిన్న చిన్న కార‌ణాల‌కు కూడా ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్న వారిని చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా తల్లి తనకు ఇష్టంలేని కటింగ్ చేయించిందన్న మనస్తాపంతో 12వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నైలోని వలసరవక్కం ప్రాంతంలో జరిగిందీ ఘటన. వివ‌రాల్లోకి వెళ్తే.. శీనివాసన్ (17) కుంద్రత్తూరులోని ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ 12వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల హాస్టల్‌కు పొంగల్ సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చాడు. అయితే చదువుకుంటున్న కుర్రాడికి ఇలాంటి ఫ్యాషన్ కటింగ్‌‌లు ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ క్ర‌మంలోనే అత‌డి సెలూన్‌కు తీసుకువెళ్లి దగ్గరుండి కటింగ్ చేయించింది మోహన. ఇక ఆదివారం ఉదయం కుమారుడిని ఇంటి దగ్గరే వదిలేసి ఆమె తన పనులకు వెళ్లిపోయింది. అయితే సాయంత్రం ఇంటికొచ్చే స‌రికి ఫ్యాన్‌కు శీనివాసన్ చీరతో ఉరివేసుకుని కనిపించాడు. కుమారుడిని విగతజీవిగా చూసిన మోహన రోదిస్తూ కుప్పకూలిపోయింది. ఆమె రోదనలు విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news