దారుణం.. 17వ తేదీన పెళ్లి.. 18న గ్యాంగ్‌ రేప్‌..!

-

దేశంలో ఎక్కడ చూసినా మానవ మృగాల బారిన పడిన ఆడ‌వాళ్ల రోదనలు వినిపిస్తూనే ఉన్నాయి. జనాల మధ్యే తిరుగుతూ.. కామంతో కళ్లు మూసుకుపోయి క్రూర జంతువుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో నవవధువుపై దారుణం జరిగింది. పెళ్లి జరిగిన తర్వాతి రోజు ఉదయాన్నే సామూహిక లైంగికదాడికి గురైంది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఠానా దేహాట్ ప్రాంతానికి చెందిన యువతికి ఓ యువకుడితో ఈ నెల 17న వివాహమైంది. అప్పగింతల తర్వాత ఆమెను అత్తారింటికి తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత రోజయిన జనవరి 18న ఇంటి నిండా చుట్టాలతో కళకళలాడుతున్న సమయంలో న‌వ వ‌దువు క‌నిపించ‌కుండా పోయింది.

దీంతో ఆమె కోసం వెతికిన బంధుమిత్రులు, పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆదివారం నాడు హాపూర్ లోని ఓ బ్యాంకు శాఖ సమీపంలో నవ వధువు అపస్మారక స్థితిలో కనిపించింది. ఇంట్లోని ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేసినట్టు గుర్తించారు. ఈ ఘటనతో బాధితురాలు షాక్ లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. అయితే అత్యాచారంపై కేసు నమోదు చేశామని, నిందితులను గాలించేందుకు చర్యలు చేపట్టామని పోలీసు అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news