రూ.2 కోసం యువకుడి హత్య.. ఏం జ‌రిగిందంటే..?

-

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కేంద్రంలోని వలసపాకలో దారుణం చోటుచేసుకుంది. కేవ‌లం రూ.2 కోసం జరిగిన గొడవ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. వలసపాకలో ఓ సైకిల్‌ షాపులో సువర్ణరాజు అనే యువకుడు గాలి కొట్టించుకున్నాడు. అనంతరం రెండు రూపాయల కోసం షాపు యజమాని సాంబతో గొడవపడ్డాడు. అంతటితో ఆగకుండా సాంబపై చేయిచేసుకున్నాడు. ఈ సమయంలో సాంబ పక్కనే ఉన్న అతని స్నేహితుడు అప్పారావు ఆగ్రహంతో ఊగిపోయాడు.

ఈ క్ర‌మంలోనే అక్కడున్న కత్తితో సువర్ణరాజును పొడిచాడు. దీంతో సువర్ణరాజు అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. దీంతో వెంట‌నే అత‌ని ఆస్పత్రికి తరలించ‌గా.. ప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news