క‌ర్నాట‌క‌లో దారుణం… పుట్టిన రోజే బాలిక‌పై అత్యాచారం

-

క‌ర్నాట‌క రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. క‌ర్నాట‌క రాష్ట్రంలోని కోలార్ జిల్లాకు చెందిన ఒక బాలిక పై పుట్టిన రోజు నాడే.. న‌లుగురు కిరాత‌కులు.. అత్యాచారం చేశారు. కాగ కోలార్ జిల్లాకు చెందిన తొమ్మిదో త‌ర‌గ‌తి బాలిక త‌న పుట్టిన రోజున త‌ల్లి దండ్రులు కొత్త బ‌ట్ట‌లు, చాక్ లెట్లు కొనివ్వ‌లేద‌ని మ‌న‌స్థపానికి గురి అయింది. దీంతో ఆ బాలిక త‌న ఇంట్లో నుంచి పారిపోయింది. స్కూల్ కు వెళ్ల‌కుండా.. వేరే బ‌స్సు ఎక్కి వెళ్లింది. బాలిక ఒంట‌రిగా ఉంద‌ని న‌లుగురు మాన‌వ మృగాలు.. నాలుగు మంచి మాట‌లు చెప్పి.. లోబ‌ర్చుకున్నారు.

ముందుగా ఒక పార్క్ వ‌ద్ద‌కు తీసుకెళ్లి.. సాయంత్రం వ‌ర‌కు ఉన్నారు. త‌ర్వాత‌.. మరో బాలిక‌ను గ్రామానికి ఒక ప్ర‌యివేటు వాహానంలో తీసుకెళ్లారు. మార్గ మ‌ద్య‌లో ఆ న‌లుగురు యువ‌కులు మ‌ద్యం తీసుకున్నారు. అనంత‌రం.. ఆ బాలిక‌ను ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్క‌డ బాలిక పై న‌లుగురు యువ‌కులు అత్యాచారానికి పాల్ప‌డ్డారు. బాలిక ఏడుపు శ‌బ్ధాలు విన్నా.. స్థానిక‌లు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని.. న‌లుగురిని అరెస్ట్ చేశారు. బాలిక‌ను స్థానికి ఆస్ప‌త్రికి త‌ర‌లించి.. చికిత్స అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version