పెళ్లయిన రెండు రోజులకే ఆత్మహత్య చేసుకున్న యువతి…!

-

కాళ్ల పారాణి కూడా ఆరలేదు. 16 రోజుల పండుగ కూడా పూర్తి కాలేదు. ఆ ఇంట్లో పెళ్లి హడావుడి కూడా ఇంకా తగ్గలేదు. ఇంతలోనే నవ వధువు ఆత్మహత్య చేసుకున్నది. పెళ్లయిన రెండు రోజులకే ఆత్మహత్య చేసుకున్నది ఆ యువతి. ఈ విషాద ఘటన తమిళనాడులోని తేని జిల్లా పులికుత్తిలో చోటు చేసుకున్నది. 23 ఏళ్ల రమ్యకు 29 ఏళ్ల రంగరాజ్ తో నవంబర్ 11 న పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత తమ బంధువుల ఇంటికి వెళ్లింది రమ్య. తన వెంట తన బాబాయ్ ముత్తు కృష్ణన్ కూడా ఉన్నాడు. అయితే.. బంధువుల ఇంటికి వెళ్లిన కొంత సేపటికే రమ్య, ఆమె బాబాయ్ స్పృహ తప్పి కింద పడిపోయారు. వెంటనే వాళ్లను ఆసుపత్రికి తరలించగా.. ఇద్దరూ విషం తాగినట్టు డాక్టర్లు తెలిపారు. వాళ్లకు చికిత్స అందిస్తుండగా.. రమ్య చికిత్స పొందుతూ మృతి చెందింది. ముత్తుకృష్ణన్ పరిస్థితి విషమంగా ఉంది. అయితే.. రమ్య, ముత్తుకృష్ణన్ ఎందుకు విషం తాగారో బంధువులకు అర్థం కావడం లేదట. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version