స్కూల్ బస్సులో నర్సరీ స్టూడెంట్​పై డ్రైవర్ అత్యాచారం

-

మధ్యప్రదేశ్​ రాజధాని భోపాల్​లో స్కూల్ బస్సు డ్రైవర్​ దారుణానికి ఒడిగట్టాడు.​ మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బస్సులో ఉన్న మహిళా అటెండర్​ సాయంతో బ్యాగ్​లోని దుస్తులను తీసి చిన్నారి డ్రెస్​ను మార్చేశాడు. అనంతరం పాపను ఇంటి వద్ద దింపేశాడు.

పాప ఒంటిపై వేరే దుస్తులు ఉన్న విషయాన్ని గమనించిన చిన్నారి తల్లి.. స్కూల్​ యాజమాన్యాన్ని ఆరా తీసింది. వారు ఆ పని మేము చేయలేదని వివరణ ఇచ్చారు. అనంతరం, చిన్నారి తన ప్రైవేట్ భాగాల్లో​ నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు చిన్నారిని దగ్గరికి తీసుకొని ఏం జరిగిందో చెప్పాలని అడిగారు. దీంతో చిన్నారి అసలు విషయం చెప్పింది. బస్సు డ్రైవర్ తనతో చెడుగా ప్రవర్తించాడని, దుస్తులు కూడా అతడే మార్చాడని తెలిపింది.

ఈ ఘటనలో నిందితుడితో పాటు అతనికి సహకరించిన మహిళా అటెండర్​ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయమై స్కూల్​ యాజమాన్యాన్ని సంప్రదించగా.. వారు దీన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితురాలి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన మధ్యప్రదేశ్​ హోం మంత్రి నరోత్తమ్​ మిశ్ర.. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version