కర్ణాటకలో దారుణం.. 15 మంది విద్యార్థులపై పీఈటీ లైంగిక దాడి

-

దేశంలో లైంగిక దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే పోలీస్ శాఖ ఎన్నికల నిబంధనలు అమలు చేసినప్పటికీ కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. అయితే తాజాగా కర్ణాటక రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ పాఠశాలలోని 15 మంది విద్యార్థినులపై 54 ఏళ్ల పీఈటి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

గత మూడు నెలలుగా ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. కర్ణాటక బెంగుళూరు లోని హెబ్బల్ ప్రభుత్వ పాఠశాలలో జరిగింది ఘటన. ఈ కేసులో టీచర్ అంజనప్పను పోలీసులు అరెస్టు చేశారు. ఆటలు ఆడించేటప్పుడు విద్యార్థినులకు ముద్దులు పెట్టడంతో పాటు అసభ్యకరంగా తాకేవాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news