70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం… ఇద్దరికి జీవిత ఖైదు

-

దేశంలో కామాంధుల అరాచకాలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. చిన్న, పెద్ద, వయస్సుతో సంబంధం లేకుండా కొందరు కామాంధులు.. మహిళలపై అరాచకాలకు ఒడిగడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని..70 ఏళ్ల వృద్ధిరాలిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడి చేశారు. ఈ కేసులో ఆ నిందితులకు జీవిత ఖైదు విధించింది కోర్టు. ఈ కేసు వివరాల్లోకి వెళితే… హైదరాబాద్‌లోని మాల్కాజ్‌ గిరి ఠాణా పరిధిలో 2019 లో డిసెంబర్‌ మాసం 17 వ తేదీన కల్లు దుకాణం వద్ద ఉన్న వృద్ధురాలితో.. పెయింటర్లు గా పనిచేస్తున్న ఆంథోని జార్జ్‌ (50), విజయ్‌ (53) మాట కలిపారు.

వృద్ధురాలిని తమ గదికి తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురూ కలిసి కల్లు సేవించారు. ఎక్కువ మోతాదులో కల్లు సేవించిన మత్తులోకి.. జారుకుంది. అదే అదునుగా చేసుకుని ఆంథోని, విజయ్‌ కుమార్‌ లు ఇద్దరు కలిసి.. వృద్ధురాలిపై అత్యాచారం చేశారు. ఇక దీనిపై ఆ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ కేసు కాస్త.. కోర్టు వరకు చేరింది. అయితే… ఈ 70 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి చేసిన ఆ ఇద్దరు నిందితులను మాల్కాజిగిరి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2019 లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు సాక్షాధారాలను కోర్టు ఎదుట సమర్పించగా… నిందితులను ఇద్దరిని దోషులుగా ధర్మాసనం తేల్చింది. అంతేకాదు.. ఇద్దరికీ జీవిత ఖైదుతో పాటు 5 వేల రూపాయల జరిమానా కూడా విధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version