ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం… భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై సామూహిక అత్యాచారం

-

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా… మహిళల రక్షణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అత్యాచారాలకు అడ్డుకట్ట పడటం లేదు. మహిళలు ఉంటరిగా ఉన్నా… లేకున్నా.. కామాంధులు కామవాంఛకు బలవుతున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో మరో ఘోరం జరిగింది. భర్త కళ్లెదుటే.. భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ లో జరిగింది.

అత్యాచారం
అత్యాచారం

పూర్తి వివరాల్లోకి వెళితే… దంపతులు ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. దంపతులిద్దరూ తమ బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణం అయ్యారు. కాలినడక నడుచుకుంటూ.. వెళ్తున్న క్రమంలో 10 మంది వ్యక్తులు అడ్డగించారు. ఇద్దరిని మామిడి తోటలోకి లాక్కెళ్లారు. నలుగురు కలిసి మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. భర్తను చెట్టుకు కట్టేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్పీ విజయవర్గియా వెల్లడించారు. ఘటనకు పాల్పడిన 10 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. బాధిత మహిళను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news